Chiranjeevi: పద్మ విభూషణ్ అవార్డు అందుకునేందుకు దిల్లీ బయలు దేరి వెళ్లిన చిరంజీవి..

Chiranjeevi Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది. తాజాగా ఈ అవార్డు స్వీకరించేందుకు చిరు.. కుటుంబ సభ్యులతో కలిసి దిల్లీ వెళ్లారు.

1 /5

కేంద్ర ప్రభుత్వం 2024 యేడాదికి గాను దేశ రెండో అత్యున్నత పద్మ విభూషణ్ అవార్డుతో మెగాస్టార్ చిరంజీవిని గౌరవించింది. గతంలో కాంగ్రెస్ పార్టీ పద్మభూషణ్‌తో గౌరవించిన సంగతి తెలిసందే కదా.

2 /5

తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అక్కినేని నాగేశ్వరరావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తర్వాత పద్మ విభూషణ్ అవార్డు అందుకోబోతున్న మూడో వ్యక్తి చిరంజీవి.

3 /5

ఇప్పటికే పద్మ అవార్డులను కొంత మందికి అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేసారు. తాజాగా ఈ గురువారం (9-5-2024)న రాష్ట్రపతి భవన్‌ నుంచి ఆహ్వానం రావడంతో చిరంజీవి తన కుటుంబ సభ్యులైన భార్య సురేఖ, కుమారుడు కోడలు రామ్ చరణ్, ఉపాసనలతో కలిసి ప్రత్యేక విమానంలో దిల్లీ బయలు దేరి వెళ్లారు.

4 /5

చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా సినిమాలే లోకంగా బతుకుతున్నారు. ఈ ఎన్నికల్లో చిరు..బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్ధులకు తన మద్దతు ప్రకటించారు.

5 /5

చిరంజీవి.. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.