Telangana: సార్వత్రిక ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది. ఈసారి గతానికి కన్నా ఎక్కువ స్థానాలు సాధించడానికి 'పంచ వ్యూహం' రచించింది. రాష్ట్రవ్యాప్తంగా యాత్రల మీద యాత్రలు చేయాలని నిర్ణయించింది.
Bonthu Rammohan: అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. కీలక నాయకులంతా పార్టీని వీడుతున్నారు. తాజాగా హైదరాబాద్కు చెందిన కీలక నాయకుడు ముఖ్యమంత్రిని కలిశారు.
Raithu Bandhu: రైతు పెట్టుబడులకు భరోసాగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతుబంధుపై కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈనేపథ్యంలో రైతు పెట్టుబడి రైతుబంధుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Telangana Budget: కొత్తగా ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ బడ్జెట్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రజలకు ఆరు గ్యారంటీలు దక్కవని చెప్పారు. ప్రజలు వాటిపై ఆశలు పెట్టుకోవద్దని సూచించారు.
Rythu Bharosa: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ యజమానులకు భారీ షాకిచ్చింది. వ్యవసాయం చేయని భూ యజమానులకు పెట్టుబడి సహాయం విషయంలో ఆంక్షలు విధించింది.
Big Shock For BRS: హస్తం గూటికి వలసల పర్వం మొదలైంది. నిన్న పట్నం మహేందర్ రెడ్డి దంపతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇక వీళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరారా? లేదా? అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. ఈనేపథ్యంలో బోరబండ కార్పొరేటర్, హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Patnam Mahender Reddy Meets Revanth Reddy: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలేటట్టు పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్యమంత్రిని కలవడంతో రాజకీయాల్లో కలకలం ఏర్పడింది.
Harish Rao Jangaon Meeting: కృష్ణా జలాల వివాదంతో మరోసారి తెలంగాణ రాజకీయాలు వేడేక్కగా.. గులాబీ పార్టీ నాయకులు వెనక్కి తగ్గడం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు మరోసారి కాంగ్రెస్పై, రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
KRMB Issue Telangana KCR: కృష్ణా జలాల అంశంపై మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న మాజీ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ నాయకులు విరుచుకుపడుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో గెలవలేక ఇలాంటి డ్రామాలకు తెరలేపారని ఒకప్పుడు కేసీఆర్ మంత్రివర్గంలో పని చేసిన జూపల్లి కృష్ణారావు విమర్శించారు.
Krishna Projects: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కృష్ణా జలాల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లతో తెలంగాణలో జల యుద్ధానికి తెరలేచింది. రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను మాజీ మంత్రి హరీశ్ రావు స్వీకరించి.. అసెంబ్లీలో చూసుకుందామని ప్రతి సవాల్ విసిరారు.
Auto Workers Free Bus: అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోపై నిలదీస్తూనే ఉన్నారు. తాజాగా మరో అంశంపై కేటీఆర్ కాంగ్రెస్ను నిలదీశారు. అయితే ఈసారి రేవంత్ రెడ్డికి లేఖరూపంలో విజ్ఞప్తి చేయడం విశేషం.
Karimnagar MP Seat: కరీంనగర్ ఎంపీగా సాధించిదేమీ లేదని మాజీ మంత్రి కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో సంజయ్ విరుచుకుపడ్డారు. వ్యక్తిగత స్థాయిలో కేటీఆర్ను విమర్శించారు.
Seethakka Vs KTR: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలపై తెలంగాణ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలోనూ.. ప్రజాక్షేత్రంలోనూ తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్పై సీతక్క విరుచుకుపడ్డారు. ప్రగతిభవన్లో కేటీఆర్ పెంచుకునే కుక్కల కోసం రూ.12 లక్షలు ఖర్చు చేశారని చెప్పారు. ప్రజా ధనాన్ని లూటీ చేశారని మండిపడ్డారు.
Siddipet Thanks Meet: తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన సిద్దిపేట నియోకవర్గ ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కృతజ్ణతలు తెలిపారు. ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పి.. పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే సత్తా చూపి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
KTR meet With Karyakartas: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నది. ఇటీవల పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష చేపట్టిన గులాబీ దళం ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలపై సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సమావేశానికి వెళ్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
BRS Party: తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంపై మండిపడ్డారు. గత ప్రభుత్వాన్ని దూషిస్తూ చేసిన ప్రసంగాన్ని కేటీఆర్ ఖండించారు. ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ నియామకం చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీ అనుబంధం తెలిసివస్తోందని, వారిద్దరిదీ ఫెవికాల్ బంధమంటూ వ్యాఖ్యానించారు.
Dragged Student: ఓ విద్యార్థినిపై మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు దారుణంగా ప్రవర్తించారు. వాహనం వెళ్తున్న కానిస్టేబుళ్లు యువతి జట్టు పట్టుకుని లాగారు. ఫలితంగా ఆ యువతి కిందపడిపోయింది. ఈ ఘటనపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత్ జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ సంఘటనను ఖండించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
Fight in Social Media: హామీలపై ప్రశ్నిస్తే 'చెప్పుతో కొట్టాలి' అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీలను అమలు చేయలని కాంగ్రెసోళ్లను ఏ 'చెప్పు'తో కొట్టాలని ప్రశ్నించారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ సభలో పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
High Alert in BRS Party: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో సమావేశం కావడం కలకలం రేపింది. ఈ సమావేశం గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. ఆ పార్టీలో చీలిక మొదలైందా..? కాంగ్రెస్తో టచ్లోకి వచ్చారా అనేది చర్చ జరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.