KCR Birth Day Celebrations: గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఈనెల 17వ తేదీతో 70 సంవత్సరాల పడిలోకి పడుతున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఆటో డ్రైవర్లకు భారీ కానుక ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో వారికి ఆదుకునే ఓ భారీ కార్యక్రమం చేపట్టనున్నారు.
Harish Rao Challenge: అసెంబ్లీలో జరిగిన పరిణామాలు తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా హరీశ్ రావు కావాలని కాళేశ్వరం నీళ్లు తీసుకురావాలని సవాల్ విసరగా.. ఆ సవాల్ను హరీశ్ రావు స్వీకరించారు. చేత కాకుంటే తప్పుకోమని సంచలన సవాల్ విసిరారు.
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సభా హక్కులను ఉల్లంఘనకు గురవుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. రోడ్డుపై కూర్చొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
KCR Speech In Nalgonda: ఓటమి అనంతరం 'ఛలో నల్లగొండ' బహిరంగ సభతో బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గర్జించారు. తెలంగాణకు అన్యాయం జరిగినే తన కట్టె కాలే వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే తాట తీస్తానని హెచ్చరించారు.
Eggs Attack: కృష్ణా ప్రాజెక్టులు నదీ యాజమాన్య బోర్డుకు అప్పగింత వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన 'ఛలో నల్లగొండ' సభకు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డంకులు సృష్టించారు. మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు.
YS Sharmila Revanth Reddy Meet: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి పునఃప్రవేశించిన తర్వాత తొలిసారి మళ్లీ తెలంగాణలో వైఎస్ షర్మిల అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశం కావడం గమనార్హం.
Harish Rao Assembly Speech: తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశంలో కృష్ణా ప్రాజెక్టులపై చర్చ జరగ్గా అధికార, ప్రతిపక్షాల మధ్య ఒక యుద్ధమే జరిగింది. హరీశ్ రావు చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.
Auto Workers Free Bus: అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోపై నిలదీస్తూనే ఉన్నారు. తాజాగా మరో అంశంపై కేటీఆర్ కాంగ్రెస్ను నిలదీశారు. అయితే ఈసారి రేవంత్ రెడ్డికి లేఖరూపంలో విజ్ఞప్తి చేయడం విశేషం.
KT Rama Rao Condemned: యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకున్న పరిణామం తెలంగాణలో తీవ్ర రాజకీయ వివాదానికి దారి తీసింది. జిల్లా పరిషత్ చైర్మన్పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దాడికి పాల్పడ్డారనే వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ భగ్గుమంది. కోమటిరెడ్డి తీరుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
Karimnagar MP Seat: కరీంనగర్ ఎంపీగా సాధించిదేమీ లేదని మాజీ మంత్రి కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో సంజయ్ విరుచుకుపడ్డారు. వ్యక్తిగత స్థాయిలో కేటీఆర్ను విమర్శించారు.
Seethakka Vs KTR: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలపై తెలంగాణ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలోనూ.. ప్రజాక్షేత్రంలోనూ తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్పై సీతక్క విరుచుకుపడ్డారు. ప్రగతిభవన్లో కేటీఆర్ పెంచుకునే కుక్కల కోసం రూ.12 లక్షలు ఖర్చు చేశారని చెప్పారు. ప్రజా ధనాన్ని లూటీ చేశారని మండిపడ్డారు.
KTR meet With Karyakartas: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నది. ఇటీవల పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష చేపట్టిన గులాబీ దళం ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలపై సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సమావేశానికి వెళ్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
BRS Party: తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంపై మండిపడ్డారు. గత ప్రభుత్వాన్ని దూషిస్తూ చేసిన ప్రసంగాన్ని కేటీఆర్ ఖండించారు. ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ నియామకం చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీ అనుబంధం తెలిసివస్తోందని, వారిద్దరిదీ ఫెవికాల్ బంధమంటూ వ్యాఖ్యానించారు.
Fight in Social Media: హామీలపై ప్రశ్నిస్తే 'చెప్పుతో కొట్టాలి' అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీలను అమలు చేయలని కాంగ్రెసోళ్లను ఏ 'చెప్పు'తో కొట్టాలని ప్రశ్నించారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ సభలో పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
General Elections: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన కారు రిపేర్ కోసం సర్వీసింగ్కు వెళ్లిందని.. లోక్సభ ఎన్నికలతో యమస్పీడ్తో దూసుకొస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తెలిపారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. విద్యుత్ బిల్లులు బరాబర్ చెల్లించవద్దని ప్రజలకు చెబుతామని స్పష్టం చేశారు. బిల్లులన్నీ సోనియాగాంధీ ఇంటికి పంపిస్తామని స్పష్టం చేశారు.
5 New Bridges over Musi River and Esa River in Hyderabad: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రజల మౌలిక అవసరాలకు అనుగుణంగా హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో కొత్తగా మరో ఐదు బ్రిడ్జిలు అందుబాటులోకి రానున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.