Bandi Sanjay Kumar: అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణలా తయారయ్యారు : బండి సంజయ్

Bandi Sanjay Kumar Satires on KCR Govt: " దళిత బంధులో ఎమ్మెల్యేలకు 30 శాతం కమీషన్లు తీసుకుంటే... మరో 30 శాతం కమీషన్ సీఎం కుటుంబానికి వెళుతోంది. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సచివాలయ నిర్మాణంతోపాటు భూ దందాల్లోనూ 60 శాతం కమీషన్లు వెళుతున్నాయి. 

Last Updated : May 22, 2023, 10:50 PM IST
Bandi Sanjay Kumar: అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణలా తయారయ్యారు : బండి సంజయ్

Bandi Sanjay Kumar Satires on KCR Govt: " దళిత బంధులో ఎమ్మెల్యేలకు 30 శాతం కమీషన్లు తీసుకుంటే... మరో 30 శాతం కమీషన్ సీఎం కుటుంబానికి వెళుతోంది. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సచివాలయ నిర్మాణంతోపాటు భూ దందాల్లోనూ 60 శాతం కమీషన్లు వెళుతున్నాయి. ఇది అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ కాదు. సారు – కారు- 60 పర్సంట్ సర్కార్ " అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఎద్దేవా చేశారు. సోమవారం జరిగిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో సాయంత్రం బండి సంజయ్ మాట్లాడారు. 

ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. సారు- కారు- 6‌0 పర్సంట్ సర్కార్ ను ఇంటికి సాగనంపేదాకా తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అని స్పష్టం చేశారు. 111 జీవో పై మహా కుట్ర జరిగిందని.. కోకాపేట భూముల కేటాయింపు వెనుక కుట్ర కోణం దాగి ఉందని బండి సంజయ్ ఆరోపించారు. ఈ విషయంలో లీగల్ సెల్ ద్వారా బీజేపి న్యాయ పోరాటం చేస్తుంది అని స్పష్టం  చేశారు. 

బీజేపీ ప్రధాన విలన్ అంటూ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడాన్ని ప్రస్తావించిన బండి సంజయ్ .. " తెలంగాణ ప్రజలకు ప్రధాన విలన్ కేసీఆరే అని మండిపడ్డారు. పాత కాలం సినిమాల్లో అల్లు రామలింగయ్య తరహాలో కాంగ్రెస్ పార్టీ సైడ్ విలన్ పాత్ర పోషిస్తే, కైకాల సత్యనారాయణ పాత్రను ఎంఐఎం, సూది, దబ్బడం పార్టీలు పోషిస్తున్నాయి" అని తనదైన శైలిలో తమ రాజకీయ ప్రత్యర్థులపై సెటైర్లు గుప్పించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీలను ఎదుర్కొనేందుకు బీజేపీ ఒక్కటే హీరో పాత్ర పోషిస్తోంది అని నేటి రాజకీయాల్లో రాజకీయ పార్టీల స్వభావాన్ని పాత సినిమాల్లో విలన్ పాత్రలతో పోల్చారు. కేసీఆర్ కబంధ హస్తాల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించి తెలంగాణలో పేదల రాజ్యాన్ని స్థాపిస్తామని అన్నారు.

Trending News