Hyderabad Rain: కొన్ని రోజులుగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండల ప్రభావానికి సామాన్య జన జీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఎండకు భయపడి ప్రజలు బైటకు వెళ్లేందుకు కూడా ధైర్యం చేయట్లేదు. ఈ క్రమంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
Vijayashanthi Out From Politics Where Is She: అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా బిజీబిజీగా ఉన్న విజయశాంతి ప్రస్తుతం ఆమె ఎక్కడా కనిపించడం లేదు. ఆమె రాజకీయాల నుంచి వైదొలిగారా? లేదా రేవంత్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్నారా? అని చర్చ జరుగుతోంది.
Hyderabad News: మల్కాజ్ గిరి ఎంపీ ఎన్నికల బరిలో ఒక టిఫిన్ చేసే యువకుడు నిలిచాడు. కొన్నేళ్ల క్రితం చిరిపిరెడ్డి రమేష్ అనే యువకుడు హైదరాబాద్ కు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే టార్గెట్ పెట్టుకుని వచ్చాడు. కానీ ఎంత కష్టపడి చదివిన కూడా సక్సెస్ కాలేకపోయాడు.
Revanth Reddy On KCR Trop: అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి హామీల అమలులో విఫలమై తీవ్ర వ్యతిరేకతను సంపాదించుకుంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శల ధాటిని తట్టుకోలేకపోతున్నారు. బస్సుయాత్రలో కేసీఆర్ సంధిస్తున్న ప్రశ్నలు, డిమాండ్లకు రేవంత్ తలొగ్గాడు. ఈ క్రమంలోనే రైతు భరోసా, పంట నష్ట పరిహారం బిల్లులు చెల్లించారు. ఇలా కేసీఆర్ ట్రాప్లో రేవంత్ రెడ్డి పడడం కాంగ్రెస్ పార్టీలో కలవరం ఏర్పడింది. ఈ ప్రభావం లోక్సభ ఎన్నికల్లో తీవ్రంగా ఉంటుందని అంచనా.
KCR Public Meeting In Siddipet: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిద్దిపేటలో గర్జించనున్నారు. అధికారం కోల్పోయిన అనంతరం బస్సుయాత్రతో విస్తృత పర్యటన చేస్తున్న కేసీఆర్ ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన సిద్దిపేటలో పర్యటించనున్నారు. బస్సు యాత్రగా వచ్చి అనంతరం ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ సంచలన ప్రసంగం చేయనున్నారు. ఈ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డితో పరిశీలించారు.
Revanth Reddy On KCR Trop: నాట్లు వేయాల్సిన సమయంలో పడాల్సిన డబ్బులు కోతల సమయంలో పడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి చాలా ఆలస్యంగా రైతుబంధు డబ్బులను విడుదల చేశారు. దీంతోపాటు పంట నష్టపరిహారానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శల ధాటిని తట్టుకోలేక ఎట్టకేలకు రైతులకు నిధులను విడుదల చేశారు.
Telangana Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 7 విడతల్లో లోక్సభకు ఎన్నికల జరగనున్నాయి. తెలంగాణకు నాల్గో విడతలో భాగంగా ఈ నెల 13న ఒకేసారి 17 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తోన్న ఈ అభ్యర్ధులు మాత్రం వెరీ వెరీ స్పెషల్..
Telangana govt: తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీచేసింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మే 13 వ తేదీన, అదే విధంగా జూన్ 4 ఎన్నికల కౌంటిగ్ జరుగనుంది. ఈ రెండు తేదీలలో కూడా వేతనంతో కూడిన దినాలుగా ప్రకటిస్తు సీఎస్ శాంతికుమారీ ఉత్తర్వులు జారీచేశారు.
Rapido Free ride offer: ర్యాపీడో రైడ్ యాప్ ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మే 13 న ఓటింగ్ రోజున హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ లలో ఉచితంగా ఓటర్లను ఎన్నికల కేంద్రానికి తరలిస్తామని తెలిపింది.
KCR Touches His Intermediate Teacher Foot In Election Campaign: ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. తనకు పాఠాలు బోధించిన గురువును చూసి ఒకింత ఉద్వేగానికి లోనయి పాదాభివందనం చేశారు.
JP Nadda on Revanth Reddy: తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ ప్రచారాన్ని స్పీడ్ పెంచింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయ ప్రకాశ్ నడ్డా భువనగిరి లోక్సభ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. చౌటుప్పల్లో సోమవారంత జరిగిన ప్రచార సభలో నడ్డా కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు బీఆర్ఎస్ పార్టీపై కూడా విమర్శలు చేశారు.
Mancherial News: పెళ్లైన రోజుల వ్యవధిలోనే భర్త, నవవధువుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఇంట్లో ఉండకుండా బైటకు వెళ్లిపోవడం చేస్తుండేవాడు. దీంతో విసిగిపోయిన భార్య, నిలదీయడంతో ఆమెతో గొడవకు దిగాడు. అంతేకాకుండా.. భార్యను ఆమె పుట్టింట్లో వదిలేసి వచ్చాడు.
K Kavitha Bail Petition Rejected By Delhi Rouse Avenue Court: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు భారీ షాక్ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్లను బెయిల్కు నిరాకరించడంతోపాటు న్యాయస్థానం తిరస్కరించడం గమనార్హం.
Asaduddin Owaisi Abused In Election Campaign: లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంపై రసవత్తర రాజకీయాలు కొనసాగుతున్నాయి. దశాబ్దాలుగా ఇక్కడి నుంచి గెలుస్తున్న ఏఐఎంఐఎం పార్టీ అధినేత ప్రస్తుత అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీకి తొలిసారి గట్టి పోటీ ఎదురైంది. బీజేపీ మాధవీలతను బరిలోకి దింపడంతో అసద్కు ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ క్రమంలో అసద్ సహనం కోల్పోయి ముస్లింలను రెచ్చగొడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రచారంలో కొందరిపై బూతు పురాణం అందుకున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.